తుఫాన్ కారు ఢీకొని ఒకరు మృతి..ఇద్దరికి తీవ్ర గాయాలు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2024-04-17 03:15 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలు పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన దమ్ము పాల్ , తన స్నేహితులు ఉమాకాంత్, వినోద్ ముగ్గురు కలిసి బైక్ పై బైపాస్ దాటే క్రమంలో అర్సపల్లి నుంచి వేగంగా వచ్చిన తుఫాన్ కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో దమ్ము పాల్, ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఉమాకాంత్, వినోద్, తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ టౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News