బాన్సువాడలో లక్ష రూపాయలు సీజ్​

బాన్సువాడ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా ప్రాంతం వద్ద తనిఖీలో భాగంగా లక్ష రూపాయల నగదును పట్టుకున్నట్లు బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు.

Update: 2024-05-02 11:31 GMT

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా ప్రాంతం వద్ద తనిఖీలో భాగంగా లక్ష రూపాయల నగదును పట్టుకున్నట్లు బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హేమ్లా నాయక్ తండాకు చెందిన ఫుల్ సింగ్ వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా లక్ష రూపాయలు దొరికాయన్నారు. వాటిని సీజ్ చేయడం జరిగిందని, సంబంధిత పత్రాలు తీసుకొని వస్తే డబ్బులు తిరిగి ఇస్తామన్నారు. లేదంటే కేసు నమోదు చేసి డబ్బులను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. 

Similar News