ధర్మపురి అరవింద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి

ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం దేగాం గ్రామంలో ఛాయ్​ పే చర్చ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు.

Update: 2024-05-02 10:38 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలం దేగాం గ్రామంలో ఛాయ్​ పే చర్చ లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో గల ఓ హోటల్లో ఛాయ్ సేవిస్తూ ప్రజలతో మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని

    ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆలూర్ విజయభారతి రెడ్డి, ఆర్మూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ పాలెపు రాజు , రాష్ట్ర సీనియర్ నాయకులు బద్ధం లింగారెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి యాదగిరి, జిల్లా అధికార ప్రతినిధి కలిగోట్ గంగాధర్, గిరీష్ ,గ్రామ బీజేపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Similar News