అభివృద్ధి, సంక్షేమమే బీజేపీ ప్రధాన లక్ష్యం

పార్లమెంట్ ఎన్నికల మహాజన్ సంపర్క్ లో భాగంగా 15వ డివిజన్ అర్సపల్లి కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Update: 2024-05-02 10:47 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : పార్లమెంట్ ఎన్నికల మహాజన్ సంపర్క్ లో భాగంగా 15వ డివిజన్ అర్సపల్లి కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కోసం నరేంద్ర మోడీ ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను, ఐఐటీ, ఏఐఎంఎంఎస్ తీసుకొచ్చారన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చుతున్నారన్నారు. కట్టెల పొయ్యితో

    పేద మహిళలకు అనారోగ్య సమస్యల పాలు కాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యువజన పథకం ద్వారా 20 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారన్నారు. 400 ఎంపీలతో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి తీసుకెళ్తారన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంచార్జ్ రమేష్, నవీన్, 95 బూత్ అధ్యక్షులు సత్యనారాయణ, 96 బూత్ అధ్యక్షులు పర్శరామ్, 97 బూత్ అధ్యక్షులు జగన్, 98 బూత్ అధ్యక్షులు చెగంటి గంగాధర్, నర్సయ్య, సాయిలు, సత్యనారాయణ, డా.రాజన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Similar News