కామారెడ్డి కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ పండుగ తెలంగాణలో వారసత్వంగా వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2022-09-30 15:18 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బతుకమ్మ పండుగ తెలంగాణలో వారసత్వంగా వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లో శుక్రవారం టీఎన్జీవోస్, ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడుతూ పూలను పూజించే పండగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మను తొమ్మిది రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం అవకాశమిచ్చిందని చెప్పారు.

మహిళలు, చిన్నారులు సంతోషంగా సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. మహిళలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డీఆర్ డీఓ సాయన్న, సీపీఓ రాజారాం, టీఎన్ జీఓ జిల్లా కార్యదర్శి సాయిలు, దేవేందర్, దేవరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News