ఆడబిడ్డ అరిగోస పడుతుంటే కేసీఆర్ ఎక్కడ?: MP అర్వింద్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు.

Update: 2023-02-25 13:23 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. వీధి కుక్కల దాడిలో పసి బాలుడు బలైతే కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఘటనపై ఇప్పటి వరకు నోరు మెదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

ర్యాగింగ్ భూతానికి వరంగల్ మెడికో ప్రీతి అరిగోస పడుతుంటే కేసీఆర్ ఎక్కడ ఉన్నారని నిలదీశారు. దళిత ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకపోవడంపై మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేలకు అమంతి సంస్కారంలోనూ అవమానం జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News