నాంపల్లి అగ్ని ప్రమాదం.. ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్‌లోని కెమికల్ గో డౌన్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా మొత్తం తొమ్మిది మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే.

Update: 2023-11-13 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్‌లోని కెమికల్ గో డౌన్‌లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకోగా మొత్తం తొమ్మిది మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి సీఎం తెలుసుకున్నారు. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

Tags:    

Similar News