''మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డికి మూడో స్థానం ఖాయం''

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

Update: 2022-08-17 13:17 GMT

దిశ, దేవరకొండ: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 20న మునుగోడులో జరిగే ప్రజా దీవెన సభను విజయవంతం చేయాలని కోరారు. మునుగోడు ఉపఎన్నిక దొంగలకు, ద్రోహులకు, గుత్తేదారులకు మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి మూడో స్థానమే ఖాయమని జోస్యం చెప్పారు. మునుగోడు అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని.. ఆ విషయం ఇక్కడి ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఫ్లోరైడ్‌ను మిషన్ భగీరథతో రూపుమాపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని ఆయన తెలిపారు. నల్ల డబ్బు దాచుకునే దొంగలకు నిలయం బీజేపీ అని ఎద్దేవా చేశారు.

దేశ ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న మోడీపై అన్ని విషయాలను సభ ద్వారా కేసీఆర్ వివరిస్తారని తెలిపారు. మునుగోడు సభతోనే ఇక్కడ ప్రజల అభిప్రాయం స్పష్టం కానుందని దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగసు జాన్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు TVN రెడ్డి, రమావత్ దాస్రు, దొంతం చంద్రశేఖర్ రెడ్డి, హన్మంత్ వెంకటేష్ గౌడ్, పసునూరి యుగేందర్ రెడ్డి, కేసాని లింగా రెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్ రావు, మునికుంట్ల వెంకట్ రెడ్డి, నేనావత్ శ్రీను, బాదేపల్లి పులిరాజు గౌడ్, బోడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News