సూర్యాపేట సభలో హుజూర్‌నగర్ అభివృద్ధిని, సైదిరెడ్డిని ప్రశంసించిన సీఎం..

సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతినివేదన సభలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురించి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

Update: 2023-08-20 16:15 GMT

దిశ, నేరేడుచర్ల : సీఎం కేసీఆర్ సూర్యాపేట పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగతినివేదన సభలో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురించి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ సిమెంట్ లైనింగ్ పనుల గురించి మాట్లాడుతూ హుజూర్‌నగర్ లో పెద్దపెద్ద నాయకులు మెునగాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడ అయ్యారని ఎవరు పటించుకోలేదని అన్నారు.

సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందించాలని లక్ష్యంతో తన చుట్టూ తిరిగి పట్టుబట్టి పనుల మంజూరుకు ఆ పనులు చేస్తున్నారని అన్నారు . నాయకులు ప్రజలపట్ల చిత్తశుద్దితో అద్భుతంగా పాలన కొనసాగిస్తున్నాడని ఆ వేదికపై ఎమ్మెల్యే సైదిరెడ్డిని సీఎం ప్రసంశించారు.

Tags:    

Similar News