నెల రోజుల్లో ఆ పని పూర్తి చేసి మీ రుణం తీర్చుకుంటా: మంత్రి కోమటిరెడ్డి కీలక హామీ

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ జిల్లా వాసులకు సంచలన హామీ ఇచ్చారు.

Update: 2024-05-10 09:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ జిల్లా వాసులకు సంచలన హామీ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు ఆగిపోయి దాదాపు 15 ఏళ్లు గడుస్తున్న విషయం తెలిసిందే. కాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి ఎస్ఎల్‌బీసీ సొరంగం పనుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. రాబోయో 30 రోజుల్లో SLBC సొరంగం పనులు పూర్తి చేస్తానని నల్గొండ ప్రజలకు హామీ ఇచ్చారు. నల్లొండలో ప్రతీ ఎకరాకు నీళ్లిచ్చి మీ రుణం తీర్చుకుంటానని తెలిపారు. మీరు ఇచ్చిన విజయాలకు సార్ధకత చేకూర్చేందుకు ప్రతి నిమిషం శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ రుణం తీర్చుకుందామని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. నల్గొండ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే మాటకు మళ్లీ మనం పునరావృతం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News