తెలంగాణలో బీజేపీకి మెజార్టీ సీట్లు : బండి సంజయ్

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Update: 2024-05-24 12:42 GMT

దిశ,చౌటుప్పల్: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం పర్యటనకు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం కోయ్యలగూడెం వద్ద బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మోడీ చరిష్మా తో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఎన్నికల గెలుపులో దోహదం చేస్తుందన్నారు. సర్వే సంస్థలు ఊహించని ఫలితాలను ఎన్నికల్లో చూస్తామని అన్నారు.

బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజుల్లో నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు. బిఆర్ఎస్ తో పోరాడింది బిజెపినే, ఇప్పుడు కాంగ్రెస్ తో పోరాడేది కూడా బిజెపి పార్టీ నే అని ప్రజల్లో విశ్వాసం ఉందన్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ లేని దేశాన్ని ప్రజలు ఊహించుకోలేకపోయారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటై బిజెపిని ఓడించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ఆయన వెంట బిజెపి నేతలు గంగిడి మనోహర్ రెడ్డి, ప్రకాష్ తదితరులున్నారు.

Similar News