ఓటర్ల పై కూసుకుంట్ల అనుచిత వ్యాఖ్యలు

మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం ఓటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-11-10 17:22 GMT

దిశ, నల్లగొండ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గం ఓటర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్‌లు బీఆర్ఎస్ పార్టీని వీడుతుండడంతో ప్రెస్ స్టేషన్‌కు పీలై ఓటమి భయంతో ఓటర్లను ఊర కుక్కలు, పిచ్చి కుక్కలతో పోల్చిన సంఘటన మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో జరిగింది.

శుక్రవారం మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో ప్రజలు అవాక్కయ్యారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను భాగంగా గ్రామాలలో ఇండ్లు రాలేదని అడిగినందుకు ప్రజలను పిచ్చి కుక్కలతో పోల్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు పిచ్చి కుక్కలు ఊర కుక్కలుగా మాట్లాడుతున్నారని వారిని పండబెట్టి తొక్కాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఈ ఎన్నికల్లో భారీ నష్టం వాటిల్లుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News