BREAKING: షాక్ సర్క్యూట్‌తో ఏటీఎంలో మంటలు.. కాలి బూడిదైన రూ.8.12 లక్షల నగదు

షాట్ సర్క్యూట్‌తో ఏటీఎంలో మంటలు చెలరేగి రూ.8.12 లక్షల నగదు బూడిదైన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

Update: 2024-04-29 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: షాట్ సర్క్యూట్‌తో ఏటీఎంలో మంటలు చెలరేగి రూ.8.12 లక్షల నగదు బూడిదైన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని ఏటీఎంలో మిషన్‌లో షాట్ సర్క్యూట్ సంభించింది. ఈ ప్రమాదంలో మిషన్‌లో ఉన్న నగదు రూ.8.12 లక్షల నగదు కాలి బూడిదైంది. అయితే, నిన్న రాత్రి కోందరు దుండగులు ఏటీఎం చోరీకి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నగదును బయటకు తీసేందుకు ఏటీఎంను పాక్షికంగా ధ్వంసం చేశారు. అయినా.. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుండగులు వెళ్లిన కాసేపటికే ఏటీఎం మిషన్‌లో షాట్ సర్క్యూట్ సంభవించి నగదు పూర్తి కాలిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.     

Tags:    

Similar News