పిల్లలను పెంచే ఆ చేతులతోనే మొక్కలు నాటండి: MP సంతోష్

పిల్లలను పెంచే చేతులతోనే మొక్కలు కూడా నాటితే వారితో పాటు ప్రకృతి అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నేత, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు.

Update: 2023-03-02 13:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పిల్లలను పెంచే చేతులతోనే మొక్కలు కూడా నాటితే వారితో పాటు ప్రకృతి అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ నేత, ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. మార్చి 8వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మహిళలంతా మహిళా సంఘం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సీఎస్ శాంతికుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌లతో కలిసి ఎంపీ సంతోష్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యకర్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనాలని కోరారు.

Tags:    

Similar News