Moranchapalle Village : వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

భూపాల పల్లి జిల్లా టేకుమట్ల మండలం మోరంచపల్లి గ్రామం మొత్తం వరదల్లో చిక్కుకుంది.

Update: 2023-07-27 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: భూపాల పల్లి జిల్లా టేకుమట్ల మండలం మోరంచపల్లి గ్రామం మొత్తం వరదల్లో చిక్కుకుంది. మొత్తం 1200 మంది గ్రామస్తులు వరదల్లో చిక్కుకున్నారు. వరద సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా సీఎం కేసీఆర్ గురువారం భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వర్షాల పరిస్థితిపై రివ్యూ నిర్వహించారు. పూర్తిగా నీట మునిగిన మోరంచపల్లిలో సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ పంపాలని సీఎం సీఎస్‌కు ఆదేశించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News