మరోసారి మోడీ గెలిస్తే.. దేశం ఆగమే: ఎమ్మెల్యే అయిలయ్య కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్, గొల్ల కురుమలను మోసం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం గాంధీ

Update: 2024-04-29 09:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్, గొల్ల కురుమలను మోసం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గోర్లు బర్లు అని కేసీఆర్ మోసం చేసిండు.. బీసీ అని చెప్పుకుంటూ మోడీ బీసీ రిజర్వేషన్లను ఎత్తేస్తా అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేడీ ఇద్దరూ ఒక్కటై బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని సీరియస్ అయ్యారు. మతాలు, కులాలను అడ్డుపెట్టుకొని మోడీ రాజకీయం చేస్తున్నాడని.. మరోసారి ఆయన అధికారంలోకి వస్తే దేశప్రజలు ఆగమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. గుడిలో దేవుడు ఉండాలి, భక్తి మనసులో ఉండాలని హితవు పలికారు. కాంగ్రెస్ గొల్ల కురుమలకు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. 17 పార్లమెంట్ సీట్లల్లో కాంగ్రెస్ గెలుపు కోసం గొల్ల కురుమలు పనిచేయాలని పిలుపునిచ్చారు. హెచ్‌పీసీసీ చీఫ్‌గా పని చేసిన కొల్లూరు మల్లప్ప ఫొటోను గాంధీ భవన్లో పెట్టడం సంతోషకరమని అన్నారు.

Similar News