గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన హోం మినిస్టర్ (వీడియో)

గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. మంత్రి తలసాని, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

Update: 2023-09-27 10:28 GMT

దిశ, సిటీబ్యూరో: గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. మంత్రి తలసాని, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి దాదాపు 90 వేల విగ్రహాలు నిమజ్జనానికి రానున్నట్లు తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News