BRS, బీజేపీలపై మంత్రి పొన్నం ఫైర్
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు.
దిశ, వెబ్డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఫస్ట్రేషన్లో ఉన్నారన్నారు. 29 రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు వస్తాయో తెలంగాణకు అదే విధంగా నిధులు వస్తాయని తెలిపారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి చూపించి బీజేపీ ఓటు అడగాలని డిమాండ్ చేశారు. పంటలకు రూ.500 బోనస్ ఇచ్చి తీరుతామని పొన్నం స్పష్టం చేశారు. కొండగట్టు, వేములవాడను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.