బాలికపై ఇంటి యజమాని అత్యాచారయత్నం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది.

Update: 2022-12-12 11:22 GMT

దిశ,పెట్ బషిరాబాద్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. 10ఏళ్ల బాలికపై ఇంటి యజమాని అత్యాచారయత్నం చేశాడు. జీడిమెట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్య నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న గాయత్రి దేవి కూతురైన 10ఏళ్ల బాలికపై ఆమె ఇంటి యజమాని దుర్గయ్య అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆదివారం బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో యజమాని పాపతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ బాలిక పనుల నుంచి ఇంటికి వచ్చిన తన తల్లికి విషయం చెప్పింది. వెంటనే బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడు దుర్గయ్యపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News