రాచకొండ సీపీగా తరుణ్ జోషి..

రాచకొండ పోలీసు కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ గా

Update: 2024-02-12 16:11 GMT

దిశ, రాచకొండ : రాచకొండ పోలీసు కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ గా తరుణ్ జోషి ను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుధీర్ బాబు ని నియమించింది. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 60 రోజుల్లో నే సుధీర్ బాబు ఫై ఎన్నికల కమిషన్ కోడ్ పిడుగు పడింది. కేవలం 24 రోజులు కోడ్ నిబంధనలకు ఎక్కువగా పని చేసినట్లు ఉండడంతో ఈ బదిలీ కి కారణమైంది అని సమాచారం. తరుణ్ జోషి గతంలో కొన్ని నెలల పాటు జాయింట్ పోలీసు కమిషనర్, అదనపు కమిషనర్ గా రాచకొండ పోలీసు కమిషనరేట్ లో పనిచేశారు. సుధీర్ బాబును మల్టీ జోన్ -2 ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీసు గా బదిలీ చేశారు. మల్టీ జోన్ -1 ఇంచార్జి గా కూడా ప్రభుత్వం భాద్యతలను అప్పగించింది.

Read More..

సీఎం రేవంత్ రెడ్డితో వైఎస్ షర్మిల భేటీ 

Tags:    

Similar News