మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విద్యార్థి...

పదవతరగతి పరీక్షలు ఫెయిల్ అయ్యారని మనస్థాపంతో ఇంట్లో నుంచి ఓ విద్యార్థి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2023-05-19 09:50 GMT

దిశ, మేడ్చల్ టౌన్ : పదవతరగతి పరీక్షలు ఫెయిల్ అయ్యారని మనస్థాపంతో ఇంట్లో నుంచి ఓ విద్యార్థి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ నివాసముండే రమణయ్య కుమారుడు రాజ వర్ధన్ (17) పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడని మనస్థాపనతో గురువారం సాయంత్రం ఇంటి నుండి వెళ్లిపోయారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. విద్యార్థి ఆచూకీ ఎవరికైనా తెలిసిన మేడ్చల్ పోలీసుల ఫోన్ నెంబర్లకు 9490617160,9490617225 సమాచారం ఇవ్వాలని సీఐ రాజశేఖర్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News