అభివృద్ధిలోకి తీసుకొచ్చేది బీజేపీ పార్టీ ఒక్కటే : ఈటల

ప్రజల కష్టాలు తీర్చి వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేది బీజేపీ పార్టీ

Update: 2024-05-02 12:35 GMT

దిశ,అల్వాల్:  ప్రజల కష్టాలు తీర్చి వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేది బీజేపీ పార్టీ ఒక్కటేనని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఇందిరా నగర్ ఖానాజీగూడలో స్థానిక నాయకులతో కలిసి పాదయాత్రచేసి ప్రజలకు అభివాదం చేశారు. అంతకు ముందు మూడు గుళ్ల అమ్మవార్లకు ఈటల ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాలను తామే ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తుందన్నారు. మోసాన్ని గమనించిన ప్రజలు నిజాన్ని తెలుసుకుని మరోసారి బీజేపికి అవకాశం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని కమలం పువ్వు కు ఓటు వేసి ఈటల రాజేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి కిరణ్, మాణిక్య రెడ్డి, మైపాల్ రెడ్డి, మురళి, నరేందర్ రెడ్డి, సుజాత,పద్మిని పాల్గొన్నారు.

Similar News