పింఛను కోసం వృద్ధుల తిప్పలు..

తెలంగాణ రాష్ట్రంలో పింఛను తీసుకునే వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు.

Update: 2023-05-25 13:10 GMT

దిశ, మేడిపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పింఛను తీసుకునే వృద్ధులకు తిప్పలు తప్పడం లేదు. ప్రతినెలా వారి కష్టాలు మారడం లేదు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ లో పోస్టాఫీస్ వద్ద పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న కష్టాలను చూస్తే చలించిపోవలసిందే. ఒకపక్క ఎండకు ఎండుతూ ఎక్కువ సమయం నిలబడలేక, కూర్చోవడానికి వెళ్తే ఆలస్యం అవుతుందేమో అని అలానే అక్కడే ఎండలో నిలబడి కొందరు.

కింద కూర్చొని కొందరు ఎంతో యాతనతో ప్రయాస పడుతున్నారు. గురువారం అధిక మొత్తంలో పింఛనుదారులు చేరుకోవడంతో ఇబ్బందిగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్య అర్థం చేసుకొని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అప్పటివరకు కనీస ఏర్పాట్లు కల్పించాలని ఫించనుదారులు కోరుతున్నారు. 

Tags:    

Similar News