పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
దిశ, కూకట్పల్లి: పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కూకట్పల్లి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన డయగ్నస్టిక్ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను వదిలి నిర్మాణం చేపట్టడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు, వైద్య అధికారి డాక్టర్ చందర్ తదితరులు పాల్గొన్నారు.