అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్లో ఆకట్టుకుంటున్న జలకన్యలు
కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని హుడా ట్రక్ పార్క్ లో ఏర్పాటు చేసిన అండర్
దిశ,కూకట్పల్లి: కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని హుడా ట్రక్ పార్క్ లో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ ఎగ్జిబిషన్లో స్కూబా డైవింగ్ చేస్తూ జలకన్యలు అందరినీ ఆకట్టుకుంటున్నారు. స్పేయిన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జలకన్యలు మమేడ్ షో నిర్వహించేందుకు రప్పించినట్టు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు రాజా రెడ్డి తెలిపారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జలకన్యలతో షో నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా హైదరాబాద్ నగరంలో జలకన్యలతో షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.