6 గ్యారంటీలు, 66 హామీలతో కాంగ్రెస్ మోసం : ఈటల

6 గ్యారంటీలు, 66 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని

Update: 2024-05-07 15:57 GMT

దిశ, కీసర: 6 గ్యారంటీలు, 66 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసిందని, సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరిత మాటలతో ప్రజల్లో పలచనయ్యారని, మల్కాజిగిరిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమనీ మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కీసర మండల పరిధిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్ మాట్లాడుతూ.. మల్కాజిగిరిలో ఏ గల్లీలో చూసిన బీజేపీ జెండానే ఎగురుతుందని, ఆడబిడ్డలు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా స్వాగతం పలికారని, అత్యధిక మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని అన్నారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం కోట్లాది నిధులను మంజూరు చేసిందనీ, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రైతు బంధు రూ. 15 వేలు ఇస్తామని ఇవ్వకుండా... తూతూమంత్రంగా రైతుబంధు వేయడం తగదన్నారు. దేశంలో శ్రీరామ రాజ్యం రాబోతుందని, ప్రధాని మోదీ మరోసారి ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. బీజేపీ పార్టీ పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కీసర మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News