పెండింగ్ పనులను పూర్తి చేయండి: గద్వాల విజయలక్ష్మి

వర్ష ప్రభావం తో ముంపుకు గురైన ప్రాంతాల్లో యుద్ధ

Update: 2023-09-05 10:51 GMT

దిశ,పేట్ బషీరాబాద్: వర్ష ప్రభావం తో ముంపుకు గురైన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసీ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ పరిధిలో మంగళవారం ఆమె కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద తో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ముంపుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా రోడ్లపై నిలిచిన వరద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జీడిమెట్ల డివిజన్ అయోధ్య నగర్, కుత్బుల్లాపూర్ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతాలతో పాటు గాజుల రామారం కల్వర్టు వద్ద వరద ఉధృతి పరిస్థితులను ఆమె అధికారులతో కలిసి సమీక్షించారు. డీసీ నాగమణి, ఈఈ కృష్ణ చైతన్య ఇతర అధికారులు సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News