బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

ఈనెల 13న జరిగే పోలింగ్ రోజు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అధిక అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజలను కోరారు.

Update: 2024-05-09 15:04 GMT

దిశ, ఘట్కేసర్ : ఈనెల 13న జరిగే పోలింగ్ రోజు కమలం పువ్వు గుర్తుకు ఓటేసి అధిక అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రజలను కోరారు. గురువారం ఘట్కేసర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు హనుమాన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ పెట్రోల్ పంప్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద ప్రచార రథం పైనుంచి ఈటెల మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. అనంతరం ఘట్కేసర్ మాజీ వార్డు సభ్యుడు రమేష్ ఈటల సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. కార్యక్రమంలో ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News