బీజేపీ గెలవడం ఖాయం: ఈటల

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశానికి చేసిన అభివృద్ధిని

Update: 2024-04-19 11:14 GMT

దిశ,మేడ్చల్ టౌన్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశానికి చేసిన అభివృద్ధిని చూసి యువకులు, మహిళలు, భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని మాజీ మంత్రి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిదిలోని సూతరిగుడాలో స్థానిక కౌన్సిలర్ రజిత వెంకటేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 150 మంది నాయకులు ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.విక్రం రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు సరస్వతి, మల్లికార్జున్, హంసా రాణి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్, సుతార్ గూడ మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, సాయి చంచల, సురేష్, కృష్ణ, వినోద్, నవనీత, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News