అర్జన్ ప్రాజెక్టు రైజ్ డెవలపర్స్‌లో ప్రమాదం.. గోడ కూలి ఐదుగురు మృతి

బాచుపల్లి అర్జన్ ప్రాజెక్టు రైజ్ కన్స్ట్రక్షన్ లో భారీ ప్రమాదం జరిగింది.

Update: 2024-05-07 15:53 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి అర్జన్ ప్రాజెక్టు రైజ్ కన్స్ట్రక్షన్ లో భారీ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాచుపల్లి పీఎస్ లిమిట్స్ లోని రేణుక ఎల్లమ్మ కాలనీ అర్జన్ కన్స్ట్రక్షన్ లో లేబర్ కోసం వేసిన రూములు కూలి పలువురు తీవ్ర గాయాలకు గురయ్యారు.గాయపడ్డ పది మందిని చికిత్స కోసం పోలీసులు మమత హాస్పిటల్ కు తరలించినట్లు సమాచారం. అయితే మరో రెండు కుటుంబాలు సుమారు 7 గురు వ్యక్తులు కన్స్ట్రక్షన్ గోడ కూలడంతో మట్టి పెళ్లల అడుగున ఉన్నట్లు సమాచారం. వారిని రక్షించేందుకు పోలీసులు జేసీబీ, క్రేన్ సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నారు. మట్టి పెళ్లలో, గోడ వారిని పూర్తిగా కప్పి వేయడంతో బాధితులు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News