బాచుపల్లిలో 51 అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహం..

బాచుపల్లిలో 51 అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహం ఏర్పాటు జరగనుంది.

Update: 2023-04-06 16:12 GMT

దిశ, కుత్బుల్లాపూర్: బాచుపల్లిలో 51 అడుగుల ఎత్తులో హనుమాన్ విగ్రహం ఏర్పాటు జరగనుంది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్ ఆగం రాజు ముదిరాజ్ ల ఆధ్వర్యంలో బాచుపల్లి పత్తికుంట సమీపంలో 51 అడుగుల ఎత్తున భారీ స్థాయిలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు గురువారం పూజా కార్యక్రమం నిర్వహించారు.

హనుమాన్ జయంతిని పురష్కరించుకుని గురువారం విగ్రహం నిర్మాణం కోసం శంకుస్థాపన ఘట్టం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు. హనుమాన్ విగ్రహా ఏర్పాటును అభినందించి అనంతరం జరిగిన శోభ యాత్రను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News