వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్ లు అన్నారు.

Update: 2024-05-02 09:56 GMT

దిశ, కొండపాక : మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్ లు అన్నారు. గురువారం కుకునూరు పల్లి మండలం లకుడారం, ముద్దపూర్ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఉఫాధిహామీ కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని

    చూసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు చెప్పే మాయ మాటలు నమ్మవద్దని, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని , కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ది చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు కోల శ్రీనివాస్, బచ్చలి మైపాల్ కిరణ్ కుమార్ చారి, ఎంపీటీసీ భూములు గౌడ్, మాజీ ఎంపీటీసీ కోల సద్దుణ రవీందర్, మాజీ సర్పంచ్ ఆకుల భద్రప్ప, ముద్ద పూర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు రిప్పల స్వామి, మల్లం అయులయ్య, గౌటి సంపత్, కొరె చరణ్ పాల్గొన్నారు. 

Similar News