ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు

ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిందని భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు పర్వతనేని శ్రీధర్ రావు అన్నారు.

Update: 2023-09-20 16:46 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చిందని భారత జాగృతి జిల్లా అధ్యక్షుడు పర్వతనేని శ్రీధర్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయ స్థాయిలో పోరాటం చేయడంతో పాటుగా అన్ని రాజకీయ పక్షాలను కలిసి బిల్లుకు మద్దతు కూడగట్టినట్లు పేర్కొన్నారు. మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించిన ఘనత కవితకు దక్కిందన్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితంగానే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు.

Tags:    

Similar News