తల్లిని చంపిన కొడుకు రిమాండ్

కుటుంబ సమస్యల విషయంలో తల్లిని హతమార్చిన కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2024-05-03 12:47 GMT

దిశ, ములుగు : కుటుంబ సమస్యల విషయంలో తల్లిని హతమార్చిన కొడుకుని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాములపర్తి గ్రామానికి చెందిన పెద్దబోయిన నరసింహులు తన తల్లి పెద్ద బోయిన భారతమ్మ, తన భార్య శిరీషలు ఏదో కుటుంబ సమస్యల విషయంలో మాట మాట పెరిగి హత్యకు దారి తీసింది. శనివారం రాత్రి అక్కడికి వచ్చిన నర్సింహులు తన తల్లి నర్సవ్వ (65)ని బూతులు తిడుతూ చేయి పట్టి లాగి గట్టిగా లాగడంతో ఆమె పక్కనే

    ఉన్న బండ రాయికి తగలడంతో రక్తస్రావనం అయింది. రక్త శ్రావణంలో కొట్టుమిట్టాడుతున్న నరసవ్వను ఆసుపత్రికి తరలించకుండా చోద్యం చూశాడు. తెల్లవారి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం విధితమే. దీనిపై మర్కుక్ పోలీసులు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేశారు. శుక్రవారం నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించినట్టు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కుక్ ఎస్ఐ మధుకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News