నామినేషన్ వేసేందుకు బయలుదేరిన రఘునందన్ రావు
బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వయంగా కారు డ్రైవర్గా మారి నామినేషన్ వేసేందుకు వెళ్ళారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పర్వం గురువారం ప్రారంభమైంది.
దిశ, మెదక్ ప్రతినిధి: బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వయంగా కారు డ్రైవర్గా మారి నామినేషన్ వేసేందుకు వెళ్ళారు. పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ పర్వం గురువారం ప్రారంభమైంది. మెదక్ కలెక్టరేట్లో మెదక్ ఎంపీ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేసేందుకు వచ్చారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద లోపలికి వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దీనితో కారు డ్రైవర్ను దింపేసి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ అర్వో ఆఫీస్ కు వెళ్ళారు. నామినేషన్ వేసే అభ్యర్థి తో పాటు మరో నలుగురికి మాత్రమే అనుమతి ఉండడం వల్ల నిబంధనలు పాటించాలని కారు నడుపుతూ వెళ్తున్నట్టు రఘునందన్ రావు తెలిపారు.