రుణాలను సద్వినియోగం చేసుకోవాలి : అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రెడ్డి

సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Update: 2023-07-31 10:50 GMT

దిశ, ములుగు : సహకార సంఘాల ద్వారా రైతులకు అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం ములుగులోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్‌ రిజిస్తార్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార సంఘాలు రైతులకు అతితక్కువ వడ్డీకే స్వల్పకాలిక, ధీర్హకాలిక రుణాలను అందిస్తున్నాయని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ అనేక సేవలందిస్తూ సహకార సంఘాలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆయనతో పాటు కార్యదర్శి రమేశ్‌బాబు, సిబ్బంది ఉన్నారు.

Tags:    

Similar News