కార్యకర్తలను బెదిరిస్తే సహించేది లేదు

ఎవరైనా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు.

Update: 2024-05-07 09:37 GMT

దిశ, హత్నూర : ఎవరైనా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని దేవుని గుట్ట తండా, సిరిపురం , తెల్ల రాళ్ల తండా, గోవిందరాజు పల్లి, చీక్ మద్దూర్ కొన్యాల, మధుర బడంపేట్, పన్యాల, బ్రాహ్మణ గూడ , నాగుల్ దేవులపల్లి, హత్నూర ,కాసాల తదితర గ్రామాల్లో మంగళవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి బీ ఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పలు గ్రామాల్లో పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ మోసపూరిత హామీలు ఇచ్చి

    ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు బీఆర్ఎస్ కార్యకర్తల ఇండ్లలోకి వెళ్లి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో రాకముందు 6 గ్యారంటీలు అమలు చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసిందని వారు గుర్తు చేశారు. బీజేపీ దేవుని పేరిట, మతం పేరుతో రాజకీయాలు చేస్తుందని అన్నారు. గ్రామాల్లో ప్రజలు బీజేపీ, కాంగ్రెస్​ను నమ్మే ప్రసక్తి లేదని అన్నారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వావిలాల నర్సింలు, మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, పీఎస్ఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు శివశంకరరావు, గౌస్ పాషా, మాయని శ్రీకాంత్, వీరేందర్, కిషోర్ నేత, మాజీ సర్పంచులు, ఎవపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Similar News