అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది

అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర వైద్యా రోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

Update: 2024-05-01 16:01 GMT

దిశ, ఆందోల్ : అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని రాష్ట్ర వైద్యా రోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం డాకూర్ గ్రామంలో దివంగత నేత, న్యాయవాది జీఆర్ కృష్ణారెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను, గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి

    కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. యువతను రెచ్చగొట్టి మత రాజకీయాలను చేస్తున్నారని ఆరోపించారు. దివంగత నేత జీఆర్ కృష్ణారెడ్డి సేవలను ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ కొనియాడారు. వారి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ ఎస్. జగన్మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పద్మనాభ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శివరాజ్, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కళాలి రమేష్ గౌడ్, నియోజకవర్గ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేశం, ప్రవీణ్ కుమార్, నాయకులు మధుసూదన్ రెడ్డి, అశోక్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజిరెడ్డి, అజయ్, శ్రీనివాస్ రెడ్డి, హనుమాన్లు, శ్రీధర్, మల్లేశం యాదవ్, జనార్ధన్, అనిల్ కుమార్ యాదవ్, శివశంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News