రేపు పటాన్ చెరు కు సీఎం రేవంత్...నీలం మధు కు మద్దతుగా రోడ్ షో...

రేపు పటాన్ చెరు కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్ చెరు పట్టణంలో రోడ్ షో నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు.

Update: 2024-05-10 09:10 GMT

దిశ, పటాన్ చెరు : రేపు పటాన్ చెరు కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్ చెరు పట్టణంలో రోడ్ షో నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు. రేవంత్ రోడ్ షో ను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రోడ్ షో నిర్వహించే రూట్ మ్యాప్ తో పాటు అంబేద్కర్ విగ్రహం వద్ద వేదికను పరిశీలించారు.

ఈ సందర్భంగా కాట మాట్లాడుతూ… మెదక్ పార్లమెంట్ లో ఎంపీగా నీలం మధు గెలుపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. నర్సాపూర్ లో జరిగిన జనజాతర సభకు తరలివచ్చిన ప్రజలే అందుకు నిదర్శనమన్నారు. మెదక్ లో మెజార్టీ లెక్కే మిగిలిందని, నీలం మధు కు భారీ మెజార్టీ అందించడం లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నామన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ మెజార్టీ అందించాడని, క్షేత్ర స్థాయిలో కష్టపడుతున్నారని, దానికి రేవంత్ మీటింగ్ తోడైతే లక్ష మెజార్టీ రావడం ఖాయమని స్పష్టంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో కు నియోజకవర్గంలోని ప్రజలంతా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News