మనస్తాపంతో యువకుడి అత్మహత్య

తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడిన ఘటన జోగిపేట పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2023-05-17 14:59 GMT

దిశ, అందోల్ : తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు అత్మహత్యకు పాల్పడిన ఘటన జోగిపేట పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై సామ్యా నాయక్‌ కథనం ప్రకారం.. జోగిపేట పట్టణానికి చెందిన కే.శ్రీనివాస్‌ (35) అనే యువకుడు పట్టణానికే చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటూ సహజీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వెళ్లిన శ్రీనివాస్, సదరు మహిళ మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శ్రీనివాస్ పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం 8 గంటల వరకు శ్రీనివాస్ గది నుంచి బయటకు రాకపోవడంతో, లోపల డోర్‌ గడియ పెట్టి ఉండడంతో సదరు మహిళ ఇరుగు పోరుగు వారిని పిలిపించి, డోర్‌ ను పగలగొట్టి చూడగా శ్రీనివాస్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ సామ్యానాయక్‌ వివరాలను సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సామ్యా నాయక్ తెలిపారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News