మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి

Update: 2022-01-18 16:26 GMT

దిశ,  కొల్చారం: మంజీరా నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం కొల్చారం మండలం అప్పాజీ పల్లి శివారులోని మంజీరా నది పాపాల మడుగు ప్రాంతంలో చోటుచేసుకుంది. మెదక్ పట్టణానికి చెందిన మహబూబ్ మంజీరా నది పాపాల మడుగులో మంగళవారం చేపలు పట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పడవ అదుపు తప్పి బోల్తా పడడంతో మహబూమ్ మృతి చెందాడు. అతని బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News