సంస్కారహీనులు రాష్ట్రాన్ని ఏలుతున్నారు : డీకే అరుణ

ఒక మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని

Update: 2024-05-03 14:27 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: ఒక మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని సంస్కారహీనులు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని, మీ ఇంటి ఆడబిడ్డ పెద్ద మెజార్టీతో గెలిపించాలని, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా మరికల్ పరిధిలోని మక్తల్, పెద్ద చింత కుంట, కొండాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదని... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల అమలలేదని ప్రశ్నించారు. ఒక మహిళను ఎలా గౌరవించాలో కూడా తెలియని సంస్కారహినులు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారని ఫైర్ అయ్యారు. పాలమూరు కీర్తిని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలి అంటే ఇక్కడ తాను గెలవాలని.. ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను చేసిన పనులు, ఈ ప్రాంత ప్రజలకు బాగా తెలుసన్నారు.

పాలమూరు ప్రజల్లో తనకు వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ ఓర్వలేక పోతోందని విమర్శించారు. ఒక మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్షలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీ ఆడబిడ్డ అరుణమ్మను తొక్కుతానని అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. నరేంద్ర మోడీని ప్రధాని కాకుండా ఆపే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తెలంగాణ తప్ప ఎక్కడ లేదన్నారు. రతంగ పాండు రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Similar News