ప్రత్యేక అధికారుల పాలనలో పడకేసిన పారిశుద్ధ్యం..

జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని వసంతాపూర్ గ్రామంలో

Update: 2024-05-02 09:14 GMT

దిశ బిజినేపల్లి, నాగర్ కర్నూల్ : జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని వసంతాపూర్ గ్రామంలో ప్రత్యేక అధికారుల పాలనలో పారిశుద్ధ్య పనులు పడకేసిందని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. బీసీ కాలనీకి చెందిన రోడ్డు చెత్తా చెదారంతో నిండి డ్రైనేజీ మయంగా తయారయ్యిందని చెరువు ఊటగా తయారవడంతో చిన్నపిల్లలు ఆడుకుంటూ అన్లా పడే అవకాశం ఉందని అంతేకాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇంటి ముందు ఉండాలంటే దుర్వాసన వెదజల్లడంతో ముక్కున వేలు వేసుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ డ్రైనేజీ గ్రామంలోని అన్ని డ్రైనేజీలు నిండి చెత్తాచెదారంతో దర్శనమిస్తున్నాయని ఎన్నోసార్లు కార్యదర్శికి ఫిర్యాదు చేసిన ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మురుగును ఆవాసంగా చేసుకొని విష సర్పాలు ఎన్నో ఇండ్లలకు వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని దానికి తోడు దోమల బెడద ఎక్కువై మా కాలనీలో రోగాల బారిన పడుతున్నామని ఉన్నత అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులు లేకపోవడంతో స్పెషల్ అధికారి పాలన నియమించడంతో ఏనాడు కూడా స్పెషల్ అధికారి మా గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేసి రోగాల బారి నుంచి కాపాడాలని కోరుచున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పలుమార్లు అధికారులకు విన్నవించిన తుంగలో తొక్కి పట్టపగలే వీధి దీపాలను వెలిగిస్తున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Similar News