జూన్ 8న జిల్లాకు మంత్రి కేటీఆర్ రాక..

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జూన్ 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటన ఖరారు అయ్యింది.

Update: 2023-06-02 16:44 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జూన్ 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటన ఖరారు అయ్యింది. ముందుగా మంత్రి కేటీఆర్ దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మూసాపేట మండలం వేముల గ్రామం వద్ద నిర్మించనున్న ఎస్జీడి కార్మింగ్ టెక్నాలజీ కంపెనీ నిర్మాణానికి ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పదిన్నర గంటల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రారంభించనున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభిస్తారు.

అనంతరం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల తర్వాత జడ్చర్ల ఎర్రగుట్ట వద్ద నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ లను పేదలకు పంపిణీ చేస్తారు. రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఈనెల ఆరవ తేదీన నాగర్ కర్నూల్, 12వ తేదీన జోగులాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు ఉండడం. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు వరుస పర్యటనలు చేస్తుండడం పార్టీ శ్రేణులలో మరింత ఉత్సాహం నెలకొంటోంది.

Tags:    

Similar News