సీఎంను కలిసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం..

నియోజకవర్గంలో కొత్తగా చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు.

Update: 2023-03-04 16:51 GMT

దిశ, కొల్లాపూర్: నియోజకవర్గంలో కొత్తగా చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఎమ్మెల్యే బీరం నియోజకవర్గంలో చేపట్టవలసిన కొత్త పనులను గురించి ముఖ్యమంత్రికి వివరించేందుకు ప్రగతి భవన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో 130కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను గురించి ముఖ్యమంత్రికి వివరించారు.

నియోజకవర్గంలో కొత్తగా సింగోటం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం, నియోజకవర్గంలో అవసరమైనచోట్ల చెక్ డ్యాంలు, మినీ లిఫ్టులు, కల్వర్టులు, బీటీ రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు అని ఎమ్మెల్యే బీరం పేర్కొన్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News