వడ్ల బస్తాల్లో కంకర రాళ్లు.. రైస్ మిల్లు సీజ్

వడ్ల బస్తాలలో కంకర రాళ్లను కలిపి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో అధికారులు శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నాగసాల వద్ద ఉన్న శ్రీ సత్య సాయి రైస్ మిల్ పై దాడులు నిర్వహించారు.

Update: 2023-02-10 17:10 GMT

దిశ, జడ్చర్ల: వడ్ల బస్తాలలో కంకర రాళ్లను కలిపి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారన్న పక్కా సమాచారంతో అధికారులు శుక్రవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం నాగసాల వద్ద ఉన్న శ్రీ సత్య సాయి రైస్ మిల్ పై దాడులు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలతో మిల్లు పై దాడులు నిర్వహించిన అధికారులు. 112 కు పైగా బస్తాలలో వరి ధాన్యం తో పాటు తూకం ఎక్కువ రావడానికి వీలుగా 10-13 ఎం ఎం కంకర రాళ్లను కలిపి ఉండడాన్ని గుర్తించారు. దీంతో రైస్ మిల్ ను అధికారులు సీజ్ చేసి మిల్లు యజమాని బాలస్వామి కేసు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. వరి ధాన్యం విషయంలో జరుగుతున్న మోసం వెలుగులోకి రావడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.


Tags:    

Similar News