గెలిపిస్తే అభివృద్ధి చేస్తా : భరత్ ప్రసాద్

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల విజయ సంకల్ప యాత్రలో

Update: 2024-05-10 16:13 GMT

దిశ, వంగూర్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల విజయ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని వంగూర్, పోల్కంపల్లి, రంగాపూర్, ఉల్పర గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ పాల్గొని మండల కేంద్రంలో గల గెల్వ లాంబ మాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయన మాట్లాడుతూ... నాగర్ కర్నూల్ పార్లమెంట్ ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం మని అన్నారు. మీరందరూ నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నరేంద్ర మోడీ ని ప్రధానమంత్రిగా మరోసారి గెలిపించుకోవాలని అన్నారు. అదేవిధంగా నాన్నగారి సూచనలతో అభివృద్ధి చేస్తానన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామని భయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రిజర్వేషన్ల గురించి అమిత్ షా మాట్లాడకపోయినా ఫేక్ వీడియోలు తయారు చేసి బిజెపి ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో స్వచ్ఛభారత్ నుంచి చంద్రయాన్ వరకు అభివృద్ధి చెందింది. అందుకే చైనా వంటి దేశాలు ప్రతిపక్షాలతో చేతులు కలిపారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా మళ్లీ పార్లమెంట్ ఎలక్షన్ లో ఐదు గ్యారెంటీలతో మోసం చేయడానికి మళ్లీ వస్తున్నారని ప్రజలకు తెలియజేశారు. కనుక మీరు అందరు నన్ను ఆశీర్వదించి నాపై నమ్మకంతో నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ రాగి రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు ఖానపురం భాస్కర్, ప్రధాన కార్యదర్శులు చీమర్ల జగన్మోహన్ రెడ్డి, సిలువేరు సైదులు, గున్న ఆనంద్ రెడ్డి, మల్లేష్, పాండు యాదవ్, పోల్కంపల్లి డొక్కు వెంకటయ్య వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News