బీఎస్పీ పార్టీలో చేరిన మాజీ ఎంపీ

రాజస్థాన్ లోని ఆళ్వార్ నందు బీఎస్పీ అధినేత్రి బెహన్ జీ మాయావతి

Update: 2024-04-17 12:44 GMT

దిశ,ఎర్రవల్లి: రాజస్థాన్ లోని ఆళ్వార్ నందు బీఎస్పీ అధినేత్రి బెహన్ జీ మాయావతి సమక్షంలో బుధవారం బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఎస్పీ పార్టీలో మాజీ ఎంపీ డా౹౹ మంద జగన్నాథం చేరారు.ఈ సందర్భంగా బెహన్ జీ మాయావతి మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం బీఎస్పీ పార్టీ త్రీవంగా ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో మీరు నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికైన విధంగానే ఈసారి కూడా బహుజనుల సహకరంతో ఎన్నికై రావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

Similar News