జన సందోహం మధ్య బీజేపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ దాఖలు

భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ జన సందోహం, పార్టీ శ్రేణులు, అభిమానులతో ఊరేగింపుగా వెళ్లి గురువారం నామినేషన్ దాఖలు చేశారు.

Update: 2024-04-18 09:01 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ జన సందోహం, పార్టీ శ్రేణులు, అభిమానులతో ఊరేగింపుగా వెళ్లి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పలువురు రాష్ట్ర, జిల్లా నేతలు తరలి రాగ జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా నామినేషన్ వేయడానికి కలెక్టరేట్ కు బయలుదేరారు.

ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు .. డప్పుల మోతల మధ్య నినాదాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా దారి పొడవున ప్రజలు డీకే అరుణకు శుభాభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కు చేరుకొని రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, అభిమానులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.


Similar News