కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ముగ్గురు మహిళలకు గాయాలైన సంఘటన ఉండవెల్లి మండల పరిధిలో జరిగింది.

Update: 2023-04-17 14:54 GMT

దిశ, అలంపూర్ టౌన్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ముగ్గురు మహిళలకు గాయాలైన సంఘటన ఉండవెల్లి మండల పరిధిలో జరిగింది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... చిన్నిపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బస్వాపురం గ్రామానికి చెందిన కూలీలను తన ఆటోలో ఎక్కించుకొని వెళ్తున్నాడు. ఈ క్రమంలో మంటెస్సోరి పాఠశాల వద్ద వెనక నుంచి అలంపూర్ మండలం సింగవరం-2 గ్రామానికి చెందిన కుర్వ మద్దిలేటి ఆటో ఢీకొనడంతో బోల్తా పడింది. ఆటోలో 8 మంది కూలీలు ఉన్నారు.

అందులో మాధవి, శేషమ్మ, మద్దమ్మలకు గాయాలయ్యాయి. ఇందులో మాధవి తలకు తీవ్ర గాయం కావడంతో కర్నూల్ కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. కుర్వ మద్దిలేటి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆటో బోల్తా పడిన సమయంలో అక్కడే ఉన్నా అలంపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తదితరులు క్షతగాత్రులను అలంపూర్ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News